News September 24, 2025
గాయత్రీ మాతగా వరంగల్ భద్రకాళీ దేవి

వరంగల్లోని భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి గాయత్రీ మాతగా కనిపించనున్నారు. ఈ రోజున చంద్రఘంటా రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం వేళల్లో సింహ, గజ వాహనాలపై ఊరేగింపు ఉంటుంది. నుదుటన చంద్రుడిని ధరించడంతో అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. ఈరూపంలో అమ్మను దర్శించుకుంటే శత్రునాశనం ఉంటుందని నమ్మకం.
Similar News
News September 24, 2025
రూ.12వేల కోట్లు టార్గెట్.. మెగా IPOకు ఫోన్ పే!

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే మెగా IPOకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రూ.12వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా సెబీ వద్ద DRHP దాఖలు చేసినట్టు సమాచారం. గ్రీన్సిగ్నల్ రాగానే దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కానుంది. దేశంలో అత్యధిక మంది వాడే డిజిటల్ పేమెంట్స్ యాప్లో ఫోన్ పే ముందు వరుసలో ఉంది. దీనికి సుమారు 60 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. నిత్యం 31 కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
News September 24, 2025
రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికల సందడి షురూ!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. వార్డు సభ్యుడి నుంచి ZP స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించారు. ఆయా నివేదికలను ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేస్తారు. వాటి ఆధారంగా సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లను త్వరలో డ్రా పద్ధతిలో నిర్ణయించనున్నారు.
News September 24, 2025
98 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ 98 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు OCT 10వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.