News August 19, 2024

‘బంగ్లా’ త‌ర‌హా గ‌తి ప‌డుతుంది: గవర్నర్‌ను హెచ్చరించిన కాంగ్రెస్ MLC

image

ముడా కేసులో సీఎం సిద్ద‌రామ‌య్య‌పై ఇచ్చిన ఆదేశాల‌ను గ‌ర‌వ్న‌ర్ వెన‌క్కి తీసుకోక‌పోతే, లేదా రాష్ట్రపతి ఆయ‌న్ని ఉప‌సంహ‌రించుకొనేలా చెయ్య‌క‌పోతే ఆయనకు బంగ్లాదేశ్ త‌ర‌హా గ‌తిప‌డుతుంద‌ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇవాన్ డిసౌజా హెచ్చ‌రించారు. బంగ్లాలో ప్ర‌ధాని దేశం విడిచిపారిపోయిన‌ట్టే గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గహ్లోత్ క‌ర్ణాట‌క వ‌దిలి పారిపోవాల్సి వ‌స్తుంద‌ని డిసౌజా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Similar News

News December 1, 2025

మేడారం పనుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి: CM

image

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార‌ సంప్ర‌దాయాలు, నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. పొర‌పాట్లు దొర్లితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. రాతి ప‌నులు, ర‌హ‌దారులు, గ‌ద్దెల చుట్టూ రాక‌పోక‌ల‌కు మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి అంశంపై CM అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

News December 1, 2025

సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

image

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.

News December 1, 2025

గంభీర్‌.. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

image

టీమ్ఇండియా కోచ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ‘గంభీర్-రోహిత్, కోహ్లీ మధ్య బంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్తుపై విశాఖ లేదా రాయ్‌పూర్‌లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది’ అని జాతీయ మీడియా తెలిపింది. టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్లు పేర్కొంది. రోహిత్, సెలక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేవని చెప్పింది.