News August 19, 2024

‘బంగ్లా’ త‌ర‌హా గ‌తి ప‌డుతుంది: గవర్నర్‌ను హెచ్చరించిన కాంగ్రెస్ MLC

image

ముడా కేసులో సీఎం సిద్ద‌రామ‌య్య‌పై ఇచ్చిన ఆదేశాల‌ను గ‌ర‌వ్న‌ర్ వెన‌క్కి తీసుకోక‌పోతే, లేదా రాష్ట్రపతి ఆయ‌న్ని ఉప‌సంహ‌రించుకొనేలా చెయ్య‌క‌పోతే ఆయనకు బంగ్లాదేశ్ త‌ర‌హా గ‌తిప‌డుతుంద‌ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇవాన్ డిసౌజా హెచ్చ‌రించారు. బంగ్లాలో ప్ర‌ధాని దేశం విడిచిపారిపోయిన‌ట్టే గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గహ్లోత్ క‌ర్ణాట‌క వ‌దిలి పారిపోవాల్సి వ‌స్తుంద‌ని డిసౌజా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Similar News

News November 23, 2025

కామారెడ్డిలో కిలో చికెన్ రూ.240

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ ధర రూ.800, బోటి కిలో రూ.400, చికెన్ కిలో రూ.240- రూ.260, లైవ్ కోడి కిలో రూ.150గా నిర్ణయించారు. కార్తీక మాసం ముగియడంతో మాంసం అమ్మకాలు కాస్త పెరిగాయని వ్యాపారస్థులు తెలిపారు.

News November 23, 2025

పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

image

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 23, 2025

నేడు భారత్ బంద్

image

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.