News March 23, 2025
రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా?

ప్రస్తుత బిజీ జీవితంలో నిద్రాసమయం కుంచించుకుపోతోంది. ఎప్పుడు పడితే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కానీ రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిద్ర నాణ్యత కోల్పోవడమే కాకుండా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అలాగే నిద్రలేచిన వెంటనే అలసట, నీరసంగా ఉండి ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. రోగనిరోధకశక్తి బలహీనపడి అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 8, 2026
యూరియా తీసుకున్న రైతులపై నిఘా

TG: ఒకేసారి 40-50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 4 జిల్లాల్లో అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి రావడంతో క్షేత్రస్థాయి విచారణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. రైతుల భూమి విస్తీర్ణం, పంటలు, యూరియా అవసరం, వినియోగాన్ని పరిశీలించనున్నాయి.
News January 8, 2026
మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 8, 2026
ఇండ్బ్యాంక్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


