News May 24, 2024

దుబాయ్ వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి!

image

విజిటింగ్ వీసాతో దుబాయ్‌కి వెళ్లేవారి వీసాల నిబంధనల్లో అక్కడి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. సందర్శకులు తప్పనిసరిగా కనీసం 3000 AEDలతో పాటు రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డయినా ఉండాలి. దుబాయ్‌లో ఎక్కడ ఉండనున్నారో ముందే తెలపాల్సి ఉంటుంది. ఇవి చూపించకపోతే బోర్డింగ్‌కు అనుమతించరు. నిన్న కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో 20 మందికి దుబాయ్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు

Similar News

News October 24, 2025

వంటింటి చిట్కాలు

image

* పకోడీలు చేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా కలిపితే అవి బాగా పొంగుతాయి.
* వెల్లుల్లిని దంచి నీటిలో కలిపి.. బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట పెడితే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు.
* కూరలో నూనె ఎక్కువైతే రెండు బ్రెడ్ ముక్కలను పొడి చేసి వేయడం వల్ల నూనెను పీల్చుకోవడంతో పాటు, కూర రుచిగా ఉంటుంది.
* చేతులకు కొబ్బరినూనె రాసుకొని పచ్చిమిర్చి కోస్తే, చేతులు మండవు.

News October 24, 2025

స్వాతి కార్తె అంటే ఏంటి?

image

27 నక్షత్రాల ఆధారంగా రైతులు ఏర్పరచుకున్న కార్తెల్లో ఇదొకటి. సూర్యుడు స్వాతి నక్షత్రానికి దగ్గరగా ఉన్న సమయాన్ని ఈ కార్తె సూచిస్తుంది. ఇది OCT 24 నుంచి NOV 6 వరకు ఉంటుంది. ఈ కార్తెలో పడే వర్షాలను ‘స్వాతి వానలు’ అంటారు. ఈ వర్షాలు వరికి ప్రతికూలం. మెట్ట పంటలకు అనుకూలం. ‘చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి’ అనే సామెత ఈ వర్షాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. వరి కోతలు, రబీ జొన్న సాగు పనులు ఇప్పుడు మొదలవుతాయి.

News October 24, 2025

ఇక ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్

image

TG: ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేలా బోర్డు ప్రతిపాదనలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు సెకండియర్‌కు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టుల్లో 80% రాత పరీక్ష, 20% మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. ఇంటర్‌లో కొత్తగా ACE(ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెట్టనున్నారు.