News December 9, 2024
గోకులం: ఉపాధి కూలీల వేతనాల వాటా పెంపు

AP: గోకులం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లను నిర్మిస్తున్నారు. వీటికి అందించే ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాల రూపంలో చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పశువుల కొట్టాల నిర్మాణంలో పాల్గొనే కూలీలకు 46 పనిదినాలకు గాను అదనంగా రూ.13,371లు చెల్లించనుంది. అలాగే గొర్రెల షెడ్లకు 67 పని దినాలకు గాను రూ.20,205లు వారి ఖాతాల్లో జమ చేయనుంది.
Similar News
News November 17, 2025
ఐబొమ్మకు ఇక సెలవు

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్ఫారమ్లకు ఉపశమనం కలిగించింది.
News November 17, 2025
ఐబొమ్మకు ఇక సెలవు

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్ఫారమ్లకు ఉపశమనం కలిగించింది.
News November 17, 2025
‘షూ బాంబర్’.. ఢిల్లీ పేలుడులో కీలక పరిణామం!

ఢిల్లీ పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. డా.ఉమర్ నబీ i20 కారును ‘షూ బాంబర్’తో పేల్చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ అయిన కారు ముందు భాగంలో షూను కనుగొన్న అధికారులు అందులో మెటల్ లాంటి వస్తువును గుర్తించారు. దీంతో బాంబును యాక్టివేట్ చేయడానికి ఉమర్ షూ ట్రిగ్గర్ను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. కాగా ఈ నెల 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 10 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు.


