News March 28, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1050 పెరిగి రూ.83,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1140 పెరగడంతో రూ.90,980 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర కూడా రూ.3000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News March 31, 2025
రంజాన్ స్పెషల్.. పసందైన విందు

రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముస్లిం సోదరులు ఇచ్చే విందు. మతాలకు అతీతంగా స్నేహితులు, సన్నిహితులను తమ ఇళ్లకు పిలిచి పసందైన చికెన్ బిర్యానీ వడ్డిస్తారు. ఆ తర్వాత తియ్యటి షేమియా తినిపిస్తారు. అనంతరం ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరి మీకూ ముస్లిం స్నేహితులు ఉన్నారా? ఈద్ సందర్భంగా మిమ్మల్ని విందుకు ఆహ్వానించారా? కామెంట్ చేయండి.
News March 31, 2025
ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
News March 31, 2025
వివాహితపై సామూహిక అత్యాచారం

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.