News May 20, 2024

ఏషియన్ రిలే ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు గోల్డ్

image

TG: ఏషియన్ రిలే ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ సత్తా చాటింది. 4*400 మిక్స్‌డ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే కొద్ది తేడాలో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌కు అర్హత సాధించలేకపోయింది. ముహమ్మద్ అజ్మల్, జ్యోతిక, అమోజ్ జాకబ్, సుభ వెంకటేశన్ బృందం 3 నిమిషాల 14.12 సెకండ్లలో రేసును పూర్తి చేయడం గమనార్హం. ఈ విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, వియత్నాం నిలిచాయి.

Similar News

News February 6, 2026

ఇషాన్ కిషన్ టాప్-3లోనే ఆడతారు: సూర్య

image

T20 WCలో ఇషాన్ కిషన్ టాప్-3లోనే బ్యాటింగ్ చేస్తారని, అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్ చేయరని IND కెప్టెన్ సూర్య స్పష్టం చేశారు. NZ సిరీస్‌లో చూపించిన ఫామ్‌ను ఇషాన్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘<<19066790>>హర్షిత్ రాణా<<>> పరిస్థితిని ఫిజియోలు పరిశీలిస్తున్నారు. ఆడతారా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆయన దూరమైతే గత రెండేళ్లలో బాగా రాణించిన ఫాస్ట్ బౌలర్‌ను తీసుకుంటాం’ అని తెలిపారు.

News February 6, 2026

సంపూర్ణ ఆహారం గొర్రెలకు అందకపోతే..

image

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

News February 6, 2026

రాయలసీమ లిఫ్ట్ పేరిట వైసీపీ డ్రామాలు: సీఎం

image

AP: కరవుతో కటకటలాడిన రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు ఎమ్మిగనూరు సభలో తెలిపారు. ఏటా 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు రాయలసీమ నుంచి వస్తున్నాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ రకాలుగా ఈ ప్రాంతానికి నీరిచ్చామని చెప్పారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ పేరిట వైసీపీ డ్రామాలు ఆడుతోందని.. ఎలాంటి అనుమతులూ లేవని ఎన్జీటీ దానిని నిలిపేసిందన్నారు.