News March 5, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.87,980లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News December 30, 2025
IPLలో రూ.13కోట్లు.. ENG వరల్డ్కప్ టీమ్లో నో ప్లేస్

SRH భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు T20 2026 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన IPL మినీ వేలంలో రూ.13కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లీగ్ T20లో బాగా పెర్ఫామ్ చేసిన లియామ్ను టీమ్లోకి తీసుకోకపోవడంతో SRH యాజమాన్యం, అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. యాషెస్ సిరీస్లో విఫలమైన వికెట్ కీపర్ జెమీ స్మిత్కూ చోటు దక్కలేదు.
News December 30, 2025
బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18709090>>బేగం ఖలీదా జియా<<>> చనిపోయిన విషయం తెలిసిందే. రేపు ఢాకాలో జరగనున్న ఆమె అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. బంగ్లాతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ప్రధానిగా ఉన్న రెండు పర్యాయాలు చైనాకు బంగ్లాను మరింత దగ్గర చేశారు. అలాగే ఆమె హయాంలోనే బంగ్లాకు చైనా ప్రధాన ఆయుధాల సప్లయర్గా నిలిచింది.
News December 30, 2025
ఇన్కమ్ రిప్లేస్మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?

ఇన్కమ్ రిప్లేస్మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఇంటిపెద్ద మరణిస్తే కుటుంబ అవసరాలకు కొంత మొత్తాన్ని ప్రతినెలా అందిస్తారు. ఇది రెంట్, బిల్లులు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్రతినెలా ఎంత అవసరం, ప్రతి ఏటా 5-10% పెంచి అందించాలనే ఆప్షన్ కూడా ముందే సెలక్ట్ చేసుకోవచ్చు. ఇంటిపెద్ద మరణించినా ఆర్థిక భరోసా ఉంటుంది.


