News April 11, 2025

మూడు రోజుల్లో రూ.5670 పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.1850 పెరగడంతో రూ.87,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,020 పెరిగి రూ.95,400 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,08,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ.5670, కేజీ వెండిపై రూ.5000 పెరగడం గమనార్హం.

Similar News

News November 28, 2025

NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NABARD<<>>లో 91పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, MBA/PGDM, CA/CS/CMA/ICWA, PhD, BBA, BMS, BE, B.Tech, LLB/LLM ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ DEC 20న, మెయిన్స్ JAN 25న నిర్వహిస్తారు. ఆసక్తిగల SC/ST/OBC/PWBDలకు DEC 8 – DEC 19 వరకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తారు.

News November 28, 2025

సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.

News November 28, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం