News April 7, 2025

మూడు రోజుల్లో ₹3000 తగ్గిన బంగారం ధరలు!

image

అమెరికా విధించిన సుంకాలతో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹280 తగ్గి ₹90,380కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹250 తగ్గి ₹82,850గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,02,900కి చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే కేజీ వెండిపై రూ.9,100, తులం బంగారంపై రూ.3000 తగ్గడం విశేషం.

Similar News

News December 1, 2025

పాలమూరు: రక్తపింజర పాముతో జాగ్రత్త

image

రక్తపింజర పాము విషం రక్త ప్రసరణ వ్యవస్థపై పనిచేసి, కరిచిన భాగం వాచిపోతుందని, తక్షణ చికిత్స తీసుకోకపోతే రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణాపాయం ఉంటుందని స్నేక్ క్యాచర్ సదాశివయ్య హెచ్చరించారు. ప్రజలందరూ ఈ పాము పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 9963536233 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

News December 1, 2025

ఆఖరి రాగం పాడేద్దామా..!

image

చూస్తుండగానే 2025లో డిసెంబర్ వచ్చేసింది. 30 రోజులు ఆగితే చివరి పేజీ కూడా చిరిగిపోతుంది. 2025ను సెల్ఫ్ రివ్యూ చేసుకుంటే.. ఎన్నో జ్ఞాపకాలు, ఘటనలు, గుణపాఠాలు. కొన్ని స్వీట్‌గా, కొన్ని ఘాటుగా, ఇంకొన్ని కాస్త కాస్ట్లీ. మిక్చర్ ప్యాకెట్ లాంటి మిక్స్డ్ ఫీల్ ఇయర్‌లో మీ బెస్ట్ ప్లేస్, మెమొరి, బ్యాడ్ డే.. ఇలా డైలీ ఓ విషయం షేర్ చేసుకుందాం. ఈ ఇయర్‌కు ఇలా ఆఖరి రాగం పాడేద్దాం!
రోజూ 7pmకు స్పెషల్‌గా కలుద్దాం.

News December 1, 2025

ఆ డాక్టర్లకు 50శాతం ఇన్సెంటివ్!

image

TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.