News December 31, 2024
తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.440 తగ్గి రూ.77,560కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.400 తగ్గి రూ.71,100 పలుకుతోంది. అటు వెండి ధర కేజీపై రూ.1900 తగ్గి రూ.98,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News October 27, 2025
రావి చెట్టును ఎందుకు పూజించాలి?

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో అగ్నిని పుట్టించే ‘అరణి మధనం’లో రావి కర్రలను ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైంది కూడా ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో దైవంతో పాటు కచ్చితంగా ఈ రావి వృక్షాలకు కూడా పూజలు నిర్వహిస్తారు.
News October 27, 2025
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్

* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15km వేగంతో కదులుతున్న తుఫాను
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
* వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు
News October 27, 2025
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.40వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. అతడు అయ్యప్ప దీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.


