News January 14, 2025
పండగ వేళ తగ్గిన బంగారం ధరలు

సంక్రాంతి పండగ వేళ ప్రీషియస్ మెటల్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.79,960 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. వెండి కిలో రూ.2000 పడిపోయి రూ.1,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.26,540 వద్ద ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ధరల్లో అనిశ్చితి తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Similar News
News September 16, 2025
శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.
News September 16, 2025
పిల్లలకు పాలు ఎలా పట్టించాలి?

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. అయితే జాగ్రత్తగా పాలు పట్టించకపోతే గొంతులోకి బదులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బిడ్డకు ప్రాణాంతకమవుతుంది. పాలిచ్చేటప్పుడు శరీరం కంటే బిడ్డ తల పైకి ఉండాలి. చేతులతో బిడ్డ భుజాలు, తల, వీపు భాగానికి ఆసరా ఇవ్వాలి. పాలివ్వడానికి తల్లి ముందుకు ఒంగకూడదు. కుర్చీలో వెనక్కి ఆనుకొని పట్టించాలి. పాలు పట్టాక జీర్ణం అయ్యేందుకు కొద్దిసేపు బిడ్డ వీపు నెమ్మదిగా నిమరాలి.
News September 16, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో నూతన పాస్పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
* ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరు.
* నల్గొండలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన పొక్సో కోర్టు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు.