News October 7, 2025
బంగారం ధరలు.. ALL TIME RECORD

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,250 పెరిగి తొలిసారి రూ.1,22,020కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,150 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,11,850 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News October 7, 2025
ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు: కాంగ్రెస్

బిహార్లో ఎన్ని నాన్ సిటిజెన్స్ ఓట్లను తొలగించారో వెల్లడించే ధైర్యం CECకి లేదని CONG ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘SIRలో పౌరులు కాని వ్యక్తుల పేరిట ఉన్న ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా తొలగించిన ఓట్ల లెక్కల్ని దేశ ప్రజలకు తెలిసేలా బయటపెట్టాలి. ఎన్నికల సంఘం ఆ పని మాత్రం చేయడం లేదు’ అని Xలో విమర్శించారు. కాగా బిహార్ SIRపై తమ అనాలసిస్ను జైరామ్ రమేశ్ Xలో పోస్టు చేశారు.
News October 7, 2025
పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.
News October 7, 2025
టుడే అప్డేట్స్

* వాల్మీకి జయంతి.. చిత్రపటానికి పూలమాల వేసిన సీఎం చంద్రబాబు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. పాల్గొన్న మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్
* మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడిన TPCC చీఫ్ మహేశ్.. సంయమనం పాటించాలని సూచన
* మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు