News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.
Similar News
News October 9, 2025
తెలుగు టైటాన్స్ ‘తగ్గేదేలే’.. వరుసగా ఐదో విజయం

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు హరియాణా స్టీలర్స్తో మ్యాచులో 46-29 తేడాతో విక్టరీ సాధించింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో 8 గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో భరత్ 20, విజయ్ మాలిక్ 8 పాయింట్లు సాధించారు. పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ, పుణెరి పల్టాన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.
News October 9, 2025
గుర్తుంచుకోండి.. మీ కర్మలకు మీరే బాధ్యులు!

ఒకప్పుడు దొంగగా ఉన్న బోయవాడు ‘నా పాపంలో భాగం పంచుకుంటారా’ అని కుటుంబసభ్యులను అడిగితే.. వాళ్లు ‘వద్దు’ అని తేల్చి చెప్పారు. ఆ మాటకు జ్ఞానోదయం పొందిన ఆ బోయవాడు నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని పఠించి, పాప విముక్తుడై వాల్మీకిగా మారి, రామాయణాన్ని రచించాడు. లోకం కూడా అంతే! ఎప్పుడూ తన లాభాలనే చూస్తుంది. మన కర్మలకు మనమే బాధ్యులమవుతాం. ఈ సత్యాన్ని తెలుసుకొని మంచి మార్గంలో పయనిస్తేనే ఆయనలా మహర్షులం అవుతాం.
News October 9, 2025
కల్తీ లిక్కరంటూ ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: CBN

AP: కల్తీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. ‘అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై YCP రాజకీయ లబ్ధికోసం రాష్ట్రమంతా దుష్ప్రచారం చేస్తోంది. ప్రాణాలు పోతున్నాయని ప్రజల్ని భయపెడుతోంది. మంత్రులు వీటిని ఖండించాలి’ అని చెప్పారు. వివేకా హత్యలో ఆడిన డ్రామాలను మరిచిపోవద్దన్నారు. ఫేక్ ప్రచారంతో ఆ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.