News October 21, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,21,700గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2000 తగ్గి, ప్రస్తుతం రూ.1,88,000 పలుకుతోంది. కాగా 6 రోజుల్లో వెండి ధర రూ.18వేలు తగ్గడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News October 21, 2025

కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

image

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.

News October 21, 2025

బొద్దింకను చంపబోయి మహిళ చావుకు కారణమైంది!

image

దక్షిణ కొరియాలో యువతి చేసిన పిచ్చి పని ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒసాన్ నగరంలో తన ఇంట్లోకి వచ్చిన బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రేను ఉపయోగించింది. ఈ క్రమంలో తన ఫ్లాట్‌కే నిప్పుపెట్టుకుంది. తర్వాత మంటలు మొత్తం అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పొరుగున ఉండే మహిళ చనిపోగా, ఆమె భర్త, 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. 30కిపైగా నివాసాలున్న బిల్డింగ్‌లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

News October 21, 2025

రేపట్నుంచి UAEలో చంద్రబాబు పర్యటన

image

AP: పెట్టుబడుల సాధన కోసం CM CBN రేపట్నుంచి 3 రోజుల పాటు UAEలో పర్యటించనున్నారు. తొలుత దుబాయ్‌లో CII నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. శోభా, లోధా, షరాఫ్ డీజీ గ్రూపులు, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. 24న AP NRT చేపట్టే తెలుగు డయాస్పోరా సదస్సుకు హాజరవుతారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ CBN చర్చిస్తారు. NOV 14, 15 తేదీల్లో జరిగే VSP సమ్మిట్‌కు ఆయా సంస్థలను ఆహ్వానించనున్నారు.