News October 17, 2025

భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

image

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News October 17, 2025

పాత రిజర్వేషన్లతో ఎన్నికలు! ఖాయమేనా..?

image

ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ఇవాళ ప్రశ్నించడంతో ప్రభుత్వం, EC అయోమయంలో పడ్డాయి. జీవో నం.9పై 2 వారాల క్రితం స్టే ఇచ్చిన కోర్టు నేడు దానిపై స్పందించకుండా డేట్ అడగడంతో ఆ జీవో రద్దయిందనే అనే ప్రశ్న తలెత్తుతోంది. అటు గవర్నమెంట్, SEC 2 వారాల సమయం అడిగాయి. దీంతో ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

News October 17, 2025

సిద్ధూ ‘తెలుసు కదా’ రివ్యూ&రేటింగ్

image

అనాథ అయిన హీరో ఫ్యామిలీగా మారాలనుకునే క్రమంలో జరిగే సంఘర్షణే స్టోరీ. అందుకోసం మాజీ ప్రియురాలు(శ్రీనిధి), భార్య(రాశీ ఖన్నా)ను హీరో డీల్ చేసే విధానం, వారి మధ్య వచ్చే సెన్సిటివ్ సీన్లు ఆకట్టుకుంటాయి. సిద్ధూ మరోసారి నటనతో మెప్పించారు. BGM, సాంగ్స్ పర్లేదు. ఫస్టాఫ్ స్లో, మాస్ ఆడియన్స్‌ను మెప్పించదు. కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.
రేటింగ్: 2.5/5

News October 17, 2025

సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో అలా లేదు: ఈసీ

image

TG: స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. ‘ఎన్నికలకు వెళ్లాలని SC కూడా చెప్పింది కదా?’ అని ECని HC ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా అలా వ్యాఖ్యానించింది కానీ ఫైనల్ ఆర్డర్ కాపీలో ఎన్నికలకు వెళ్లాలనే ఆదేశాలు లేవని EC పేర్కొంది. రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు ఎలక్షన్స్ నిర్వహించలేమంది. ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ ఇస్తామని HCకి వివరించింది.