News August 29, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.650 ఎగబాకి రూ.94,700 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,29,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News September 1, 2025

అధికారులపై అవినీతి ఆరోపణలు.. CM సీరియస్

image

TG: కొందరు అధికారులు భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో అలసత్వం వహిస్తున్నారని CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ‘బిల్డ్ నౌ’ అనుమతులపై CM సమీక్ష నిర్వహించారు. ‘పర్మిషన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆఫీసర్లను సరెండర్ చేయాలి. అలాగే ఇరిగేషన్ అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు సహించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

News September 1, 2025

కవితపై బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్

image

TG: BRS పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అన్న <<17582811>>కవితపై<<>> ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. లిక్కర్ స్కాం కేసు సమయంలో కార్యకర్తలు మద్దతుగా నిలిచారని, SMలో తప్పుడు ప్రచారాలను ఖండించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు KCR పెట్టిన పార్టీనే విమర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని, కావాలనే ఆమెను సైడ్ చేస్తున్నారని కవిత అభిమానులు అంటున్నారు. మీ కామెంట్?

News September 1, 2025

త్వరలో ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్

image

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో రిలీజ్ చేసి తెలిపారు. ఇందులో చరణ్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహ్మాన్ ఉన్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్నట్లు టాక్.