News March 14, 2025

ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.

Similar News

News November 18, 2025

ఇంట్లో అవమానాలు.. iBomma రవి కథలో షాకింగ్ ట్విస్ట్

image

పోలీసుల విచారణలో iBomma రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్‌డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్‌కు మకాం మార్చాడు.

News November 18, 2025

ఇంట్లో అవమానాలు.. iBomma రవి కథలో షాకింగ్ ట్విస్ట్

image

పోలీసుల విచారణలో iBomma రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్‌డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్‌కు మకాం మార్చాడు.

News November 18, 2025

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.