News August 7, 2025
మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్స్!

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹220 పెరిగి ₹1,02,550కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹94,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News August 7, 2025
ప్రజల డబ్బుకు మీ డబ్బా ఎందుకబ్బా!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల <<17319958>>స్కీములకు<<>> పార్టీ నాయకుల పేర్లు, ఫొటోల వాడకం దేశంలో సాధారణమైంది. సొంత డబ్బు ప్రజలకు ఖర్చు చేస్తే ఆ నేత పేరు, ఫొటో పెట్టుకుంటే సరే కానీ ప్రజల డబ్బుతో అందించే పథకాలకు సొంత ప్రచారం సరికాదని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. CM/PM ఫొటో బదులు శాశ్వతంగా ఉండే ప్రభుత్వ చిహ్నం వాడటం ఉత్తమం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ ప్రభుత్వమూ ఇలా చేయదు. ఇంతకీ నేతల ఫొటో, పేరు ఉండాలా?ఏమంటారు?
News August 7, 2025
లోయలో పడ్డ CRPF వ్యాను.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మరణించారు. కద్వా-బసంత్గఢ్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 12 మందికి గాయాలయ్యాయి.
News August 7, 2025
బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే బీజేపీ ఓటమి ఖాయం: పొన్నం

TG: బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో బీసీలు బీజేపీని తిరస్కరించారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చావుతప్పి కన్నులొట్ట.. అన్నట్లుగా గెలిచిందన్నారు. కిషన్ రెడ్డి వంటి వారి కుట్రలను సాగనివ్వబోమని, గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామని స్పష్టం చేశారు.