News April 4, 2025

GOLD: ది సిల్వర్ జూబిలీ స్టోరీ

image

మిలీనియమ్ ఇయర్ 2000లో భారత్‌లో 10 గ్రా. బంగారం సగటు ధర ₹4,400. తర్వాతి ఐదేళ్లలో ₹3వేలే పెరిగింది. ఆ తర్వాతి మూడేళ్లకు 2008లో ప్రపంచ మాంద్యంతో ₹13వేలకి చేరింది. 2018లో ₹30వేలు, 2020లో ₹50వేలు దాటింది. 2021లో ₹48వేలకు తగ్గినా 2022లో పెరిగి ₹55వేలకు వెళ్లింది. 2023లో ₹63వేలు, 2024లో ₹78వేలు పలికిన పసిడి ఇప్పుడు ₹90వేలపై కూర్చుంది. ఈ ఏడాది చివరికి లక్షకు చేరడం ఖాయమట. ఇది గోల్డ్ సిల్వర్ జూబిలీ కథ.

Similar News

News April 11, 2025

పెండింగ్ కేసుల పరిష్కారానికి త్వరలో ఈవెనింగ్ కోర్టులు!

image

జిల్లా కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 785 ఈవెనింగ్ కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయ శాఖ యోచిస్తోంది. ప్రస్తుత కోర్టు ప్రాంగణాల్లోనే సాధారణ పనివేళల అనంతరం 5pm-9pm మధ్య ఇవి పనిచేస్తాయని సమాచారం. గత 3 ఏళ్లలో రిటైరైన జడ్జీలను కాంట్రాక్టు పద్ధతిలో వీటిలో నియమిస్తారని తెలుస్తోంది. మైనర్ క్రిమినల్ కేసులు, 3 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించదగిన కేసులను ఈ కోర్టుల్లో విచారించనున్నారు.

News April 11, 2025

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్?

image

తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్‌గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగేంద్రన్‌ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.

News April 11, 2025

త్వరలో బీసీ సంరక్షణ చట్టం: చంద్రబాబు

image

AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. మరోవైపు అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

error: Content is protected !!