News July 11, 2024
కెప్టెన్సీకి హసరంగ గుడ్ బై

టీ20 కెప్టెన్సీ నుంచి శ్రీలంక సారథి వనిందు హసరంగ తప్పుకున్నారు. టీ20 వరల్డ్ కప్లో తమ జట్టు ఘోర ప్రదర్శన చేయడంతోనే ఆయన తన కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. భారత్తో సిరీస్కు ముందు ఆయన తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా గతేడాది హసరంగ టీ20 జట్టు కెప్టెన్గా నియమితులయ్యారు. ఇప్పటివరకు పది మ్యాచులకు ఈ ఆల్రౌండర్ సారథిగా వ్యవహరించారు.
Similar News
News January 24, 2026
LRS దరఖాస్తు గడువు పొడిగింపు

AP: అనధికార లేఅవుట్ల <<18905073>>రెగ్యులరైజేషన్కు<<>> విధించిన గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రూ.10వేలు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు 61,947 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం LRS దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.
News January 23, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్(82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.
News January 23, 2026
యూనస్ ఫాసిస్ట్, దేశద్రోహి: షేక్ హసీనా

BANలో యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా అన్నారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆమె ఆడియో మెసేజ్ను నిర్వాహకులు ప్లే చేశారు. యూనస్ను ఫాసిస్ట్, దేశద్రోహిగా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విదేశాలకు సేవ చేసే కీలు బొమ్మగా ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనలపై UNతో ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నారు.


