News April 10, 2025
GOOD NEWS కాగజ్నగర్కు ట్రామా కేర్ సెంటర్

కాగజ్నగర్లో ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు HYDలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యదర్శి అంజన్ కుమార్ను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్బాబు కలిసి ధన్యావాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ట్రామా కేర్ సెంటర్పై తాను మాట్లాడినందుకు కాగజ్నగర్లో దాన్ని మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 23, 2025
MNCL: కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్

డబ్బుల కోసం కొడుకుపై దాడి చేసిన తండ్రిని అరెస్ట్ చేసినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు. కిషన్ జీతం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న తండ్రి శంకర్ నాయక్ శుక్రవారం భోజనం చేస్తున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కిషన్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శనివారం శంకర్ నాయక్ను అరెస్ట్ చేశారు.
News November 23, 2025
నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.
News November 23, 2025
KMM: డీసీసీ అధ్యక్షుల్లో మంత్రుల అనుచరులకు కీలక స్థానం

ఖమ్మం డీసీసీ అధ్యక్షుల నియామకంలో ముగ్గురు మంత్రుల అనుచరులకు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి వర్గానికి చెందిన నూతి సత్యనారాయణ, ఖమ్మం టౌన్ అధ్యక్షుడిగా తుమ్మల వర్గం నుంచి నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా మంత్రి పొంగులేటి వర్గానికి చెందిన తోటదేవి ప్రసన్న ఖరారయ్యారు. ఈ నియామకాలతో సామాజిక న్యాయం కూడా జరిగిందనే చర్చ జరుగుతోంది.


