News April 10, 2025

GOOD NEWS కాగజ్‌నగర్‌కు ట్రామా కేర్ సెంటర్

image

కాగజ్‌నగర్‌లో ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు HYDలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యదర్శి అంజన్ కుమార్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కలిసి ధన్యావాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ట్రామా కేర్ సెంటర్‌పై తాను మాట్లాడినందుకు కాగజ్‌నగర్‌లో దాన్ని మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 6, 2025

నిర్మల్: ముగిసిన మూడవదశ నామినేషన్ ప్రక్రియ

image

నిర్మల్ జిల్లాలో మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఐదు మండలాల్లో మొత్తం 714 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ డీపీఓ ప్రకటనలో తెలిపారు. చివరి రోజు అత్యధికంగా కుబీర్ మండలంలో 116 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఐదు మండలాల్లో 133 సర్పంచ్ స్థానాలకు 714 మంది పోటీ పడుతున్నారు.

News December 6, 2025

నిజమైన భక్తులు ఎవరంటే?

image

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>

News December 6, 2025

HYD: ఓఆర్ఆర్‌పై ప్రమాదాలు తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీ

image

ఓఆర్ఆర్‌పై అతివేగం, రాంగ్‌సైడ్ పార్కింగ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్ పోలీసులు, హెచ్ జీసీసీలు సంయుక్తంగా కార్యాచరణ దిగి 24 గంటల పాటు ఔటర్‌పై నిఘా ఉంచేందుకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.