News September 3, 2024

‘ఉచిత ఇసుక’పై ప్రభుత్వం GOOD NEWS

image

AP:ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌పై అవగాహన లేనివాళ్లు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకోవచ్చు. ఏ రీచ్, ఏ స్టాక్ నుంచి ఎప్పుడు ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారు. వాగులు, వంకలు, నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్ పార్టీతో అధికారులు పరిశీలిస్తారు.

Similar News

News February 2, 2025

కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు

image

గత నెల 29న మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30మంది మృతిచెందగా 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం దిశలో యూపీ సర్కారు దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 16వేలకు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఘటనపై దర్యాప్తుకోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

News February 2, 2025

నా అవార్డు మా నాన్నకు అంకితం: గొంగడి త్రిష

image

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ నాకు ఆదర్శం. అండర్-19 వరల్డ్ కప్ భారత్‌ను వదిలి వెళ్లకూడదని అనుకున్నాను. నా బలాలపైనే దృష్టి పెట్టి ఆడాను. దేశానికి మరిన్ని మ్యాచులు ఆడి గెలవాలన్నది నా లక్ష్యం’ అని తెలిపారు.

News February 2, 2025

రేపు పార్లమెంట్‌కు వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదిక

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికను JPC ఛైర్మన్ జగదాంబికా పాల్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించే అవకాశం ఉంది. ఇటీవలే ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన 44 సవరణల్ని జేపీసీ తిరస్కరించగా, NDA సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను ఆమోదించింది. సవరణలకు 16 మంది మద్దతివ్వగా, 10 మంది వ్యతిరేకించారు.