News November 16, 2024

గుడ్ న్యూస్.. ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు

image

TG: పదవ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ గడువు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండితో గడువు ముగియనుండగా ఈ నెల 28 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. చలానా విధానాన్ని రద్దు చేస్తూ, పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

Similar News

News February 22, 2026

తిరుమల వ్యవహారం.. SCలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి SCలో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, CM చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం రేపు ఈ పిటిషన్‌ను విచారించనుంది.

News February 22, 2026

బానిసత్వ మనస్తత్వం వీడాలి.. దేశ సంస్కృతిని గౌరవించుకోవాలి: మోదీ

image

బానిసత్వ మనస్తత్వం వీడి భారతీయ సంస్కృతిని గౌరవించుకోవాలని PM మోదీ పిలుపునిచ్చారు. రేపటి నుంచి MAR 1 వరకు రాష్ట్రపతి భవన్‌లో ‘రాజాజీ ఉత్సవం’ నిర్వహించనున్నట్లు ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో తెలిపారు. AI సమ్మిట్ గురించి ప్రస్తావించారు. AIలో దేశ పురోగతి, యానిమల్ హెల్త్ కేర్&అగ్రికల్చర్‌లో టెక్నాలజీ వినియోగంపై వివరించారు. ఈ నెల 24న TN మాజీ సీఎం జయలలిత జయంతి నేపథ్యంలో ఆమె సేవలను గుర్తుచేశారు.

News February 22, 2026

పాకిస్థాన్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

image

భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోతుండటానికి టీమ్ సెలక్షనే కారణం అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని.. అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాక్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. కాగా పాక్ <<19206100>>సెమీస్<<>> చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.