News November 30, 2024
మందుబాబులకు గుడ్న్యూస్.. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గింపు

APలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే అందిస్తున్న ప్రభుత్వం మరిన్ని బ్రాండ్లపై రేట్లను తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర ₹230 నుంచి ₹210కి, ఫుల్ బాటిల్ ₹920 నుంచి ₹840కి తగ్గింది. మాన్షన్హౌస్ క్వార్టర్ ₹220 నుంచి ₹190కి, ఫుల్ బాటిల్ ₹870 నుంచి రూ.760కి, యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ₹1,600 నుంచి ₹1,400కు తగ్గించి అమ్ముతోంది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది.
Similar News
News March 1, 2026
3 నెలల్లో 3 టార్గెట్లు.. నెక్స్ట్ ఎవరో!

2026 ప్రారంభంలో అమెరికా తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం, ఫిబ్రవరిలో మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతమవ్వడం, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం సంచలనంగా మారాయి. ఈ వరుస పరిణామాలతో అమెరికా తదుపరి టార్గెట్ ఎవరనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. అగ్రరాజ్యం తన దూకుడుతో అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది.
News March 1, 2026
హైదరాబాద్లో టీచింగ్ పోస్టులు

<
News March 1, 2026
ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.


