News October 13, 2024
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్!

ఈ దీపావళికి దేశీయ మార్గాల్లో విమాన టికెట్ల ధరలు సగటున 20-25% తగ్గినట్టు పలు సంస్థలు చెబుతున్నాయి. 30 రోజుల అడ్వాన్స్ బుకింగ్పై వన్ వేలో ఈ సగటు తగ్గింపు ధరలు వర్తిస్తున్నాయి. పెరిగిన విమానాల సంఖ్య, ఇంధన ధరల తగ్గింపు వల్ల ధరలు దిగొచ్చినట్టు అంచనా వేస్తున్నాయి. HYD-ఢిల్లీ మార్గాల్లో 32% ధరలు తగ్గినట్టు విశ్లేషిస్తున్నాయి. గత ఏడాది కంటే ధరలు తగ్గినట్టు సంస్థలు పేర్కొన్నాయి.
Similar News
News November 18, 2025
కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.
News November 18, 2025
కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.
News November 18, 2025
బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెడుతున్నారు: మద్రాస్ హైకోర్టు

విఫలమైన ప్రతి బంధాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) వ్యాఖ్యానించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దేవా విజయ్(తిరునెల్వేలి) తనతో 9ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్నాడని, మోసం చేశాడని ఓ యువతి రేప్ కేసు పెట్టింది. దీనిపై విజయ్ కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు యువతిని మోసం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.


