News September 21, 2024
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
AP: ఎంఎన్సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. మెక్డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న రాష్ట్రానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే వస్తాయన్నారు.
Similar News
News September 21, 2024
మరో 2 గంటల్లో వర్షం..
TG: హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. యాప్రాల్, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో 2 గంటల్లో సికింద్రాబాద్, బేగంపేట, కూకట్పల్లి సహా సెంట్రల్, ఈస్ట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్మ్యాన్ అంచనా వేశారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరి మీ ఏరియాలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.
News September 21, 2024
లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక
AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News September 21, 2024
INDvBAN: వరుణుడి పలకరింపు
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న చిదంబరం స్టేడియంలో రాత్రి, తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో మైదానంపై కవర్స్ కప్పారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో కవర్స్ను తొలగించారు. ఆటగాళ్లు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అటు ఇప్పటికే 321 రన్స్ ఆధిక్యంలో ఉన్న భారత భారీ స్కోర్ చేస్తే ఈరోజు మ్యాచ్ను గెలిచే ఛాన్స్ ఉంది.