News March 4, 2025
భవన నిర్మాణదారులకు శుభవార్త

AP: ఐదంతస్తుల లోపు లేదా 18 మీటర్లలోపు భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. టౌన్ప్లానింగ్ అధికారుల అనుమతి అవసరం లేదని తెలిపింది. రిజిస్టర్డ్ LPTలు, ఇంజినీర్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్లు ఇవ్వాలంది. ఈ మేరకు APDPMS పోర్టల్లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
Similar News
News March 4, 2025
అకౌంట్లోకి రూ.15,000.. కీలక ప్రకటన

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం గైడ్లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, బడ్జెట్లో రూ.9407 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కాగా ఈ పథకం కింద 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం రూ.15,000 జమ చేయనుంది.
News March 4, 2025
జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నిలిపేసింది: మంత్రి నిమ్మల

AP: పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపేసిందని, డయాఫ్రంవాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలవ పనులు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.
News March 4, 2025
ICAI పరీక్షా ఫలితాల విడుదల

సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ICAI) ఈరోజు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది జనవరిలో 11, 13, 15, 17, 19, 21 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <