News December 10, 2024

సీయూఈటీ-యూజీ రాసేవారికి గుడ్ న్యూస్

image

సీయూఈటీ-యూజీ 2025 పరీక్షలు రాసే అభ్యర్థులకు UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఏ సబ్జెక్ట్‌కైనా దరఖాస్తు చేసుకోవచ్చని, మొత్తం 63 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

Similar News

News January 28, 2026

నేడు వైజాగ్‌లో 4th టీ20.. జట్టులో మార్పులు?

image

భారత్, న్యూజిలాండ్ మధ్య 4th T20 మ్యాచ్ నేడు వైజాగ్ వేదికగా జరగనుంది. సిరీస్‌ను IND ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచులో ప్రయోగాలు చేయొచ్చు. హార్దిక్, హర్షిత్‌కు రెస్ట్ ఇచ్చి అక్షర్, అర్ష్‌దీప్‌ను ఆడించే అవకాశముంది. తొలి 3 మ్యాచుల్లో ఫెయిలైన శాంసన్ ఈరోజు రాణిస్తారా? శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
LIVE: 7PM నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో.

News January 28, 2026

మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

image

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News January 28, 2026

కలుపు తీయనివాడు కోత కోయడు

image

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.