News December 31, 2024
మందుబాబులకు గుడ్న్యూస్

AP: నేడు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాత్రి 1గంట వరకు వైన్స్, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి. న్యూఇయర్ సందర్భంగా మద్యం వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు ఓపెన్ ఉండే దుకాణాలు ఒంటి గంట వరకు విక్రయాలు జరపనున్నాయి. బెల్టు షాపుల దోపిడీ అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 21, 2026
ఆ హీరోయిన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్!

బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారారు. సినిమా అవకాశాలు తగ్గాక దుబాయ్లో సెటిల్ అయ్యారు. ‘ఇక్కడ 95% మంది ప్రవాసులే. రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్రమశిక్షణ ఉంటుంది. ఏజెంట్లను ఆర్థిక సలహాదారులతో సమానంగా చూస్తారు. అదే ఇండియాలో 2నెలల బ్రోకరేజీ అడిగితే నేరం అన్నట్లుగా చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హిందీలో ధూమ్, హంగామా, గోల్మాల్తోపాటు తెలుగులో అందరివాడు మూవీలో ఆమె నటించారు.
News January 21, 2026
FLASH: పెరిగిన వెండి ధర

ఇవాళ ఉదయం నుంచి తటస్థంగా ఉన్న వెండి ధర మధ్యాహ్నం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.3,45,000కు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,474గా ఉంది.
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.


