News October 29, 2024
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

AP: డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో ₹55Crతో 129 MSMEల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ₹5L-₹60L మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. NOV రెండో వారంలో వీటిని ప్రారంభించనుంది. మొత్తం వ్యయంలో 35% రాయితీ ఉండగా, 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది. ఇందుకోసం కేంద్ర పథకాలైన PMFME, PMEGPలను అనుసంధానించింది.
Similar News
News January 25, 2026
మీరు చదివిన స్కూల్ ఇప్పుడు ఉందా..?

మనం చదివిన స్కూల్, కాలేజ్ ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. కానీ ప్రైవేట్లో చదివిన చాలామంది స్కూళ్లు, కాలేజెస్ ఇప్పుడు లేవు. పేరు, మేనేజ్మెంట్ మారడం, ఆ బిల్డింగ్లో మరొకటి కొనసాగడం సహా కొన్ని చోట్లయితే అసలు ఆ నిర్మాణాలే లేవు. ఇంకొందరికైతే స్కూల్ to కాలేజ్ ఏవీ లేవు. ఆ డేస్ గురించి ఫ్రెండ్స్, ఫ్యామిలీ చిట్చాట్లో ఈ మధ్య ఎక్కువగా ఇవి విన్పిస్తున్నాయి. ఇంతకీ మీరు చదివినవి ఇప్పుడున్నాయా? కామెంట్ చేయండి.
News January 25, 2026
చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.
News January 25, 2026
భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.


