News September 24, 2024
ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త

TG:బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, బీమా రంగాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 10 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దేశంలో తొలిసారిగా ఓ కోర్సును తీసుకొస్తోంది. దీనిని ఈ నెల 25న CM రేవంత్ ప్రారంభిస్తారు. 18 ఇంజినీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో అమలు చేసి కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్, ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగమూ లభించేలా చూస్తారు.
Similar News
News January 15, 2026
‘జైలర్-2’లో విజయ్ సేతుపతి

రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తున్నట్లు విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించారు. గతంలో ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ఆయన స్థానంలో సేతుపతిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్లో మోహన్లాల్, శివరాజ్కుమార్తో పాటు షారుక్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల హింట్ ఇచ్చారు.
News January 15, 2026
బంగ్లా క్రికెట్లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.
News January 15, 2026
MOIL లిమిటెడ్లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

<


