News October 13, 2024

రైతులకు శుభవార్త

image

TG: రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సోలార్ పంపు సెట్లతో రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. పంట, పవర్‌తో రైతులు అదనపు లాభం పొందేలా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు చేడతాం’ అని ఆయన ప్రకటించారు.

Similar News

News February 12, 2026

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News February 12, 2026

రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రేషన్ కార్డులు లేని అర్హులైన వ్యక్తులు ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని తెలిపింది. గత ఏడాది కాలంలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించింది. కాగా 2026 JANకి మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరాయంది.

News February 12, 2026

₹10లక్షలు చెల్లించాలి; ధోనీకి HC ఆదేశం.. కారణమిదే!

image

MS ధోనీ గతంలో వేసిన పరువు నష్టం దావా కేసును విచారించేందుకు వీడియోలను డాక్యుమెంట్లుగా మార్చేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10లక్షలు చెల్లించాలని మద్రాస్ కోర్టు ఆదేశించింది. 2013 IPL ఫిక్సింగ్‌లో ధోనీ హస్తం ఉందని Ex IPS జి.సంపత్ కుమార్, మరికొందరు ఆరోపణలు చేశారు. దీంతో ₹100 కోట్లకు ధోనీ పరువునష్టం దావా వేశారు. 2025 ఆగస్టులో కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ఇచ్చింది.