News October 13, 2024
రైతులకు శుభవార్త

TG: రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సోలార్ పంపు సెట్లతో రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. పంట, పవర్తో రైతులు అదనపు లాభం పొందేలా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు చేడతాం’ అని ఆయన ప్రకటించారు.
Similar News
News March 2, 2026
గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు

గల్ఫ్ యుద్ధంతో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్కు అన్ని ఫ్లైట్స్, ఐరోపా దేశాలకు వెళ్లే 6 విమానాలను ఈరోజు రాత్రి 11.59 గంటల వరకు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. దుబాయ్, షార్జా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. అటు దుబాయ్, సౌదీ, కువైట్ ఎయిర్పోర్టుల్లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News March 2, 2026
అమెరికాకు ఇరాన్ ‘రివర్స్’ షాక్!

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చేజిక్కించుకున్న అమెరికా ఆయుధాలే ఇప్పుడు ఇరాన్కు కీలకం అయ్యాయి. USకు చెందిన BGM-71 TOW యాంటీ ట్యాంక్ మిస్సైల్ను రివర్స్ ఇంజినీరింగ్ చేసి ఇరాన్ ‘తూఫాన్’ తయారుచేసింది. గూఢచారి డ్రోన్ RQ-170 Sentinel డిజైన్తో శక్తిమంతమైన ‘షాహెద్’ డ్రోన్లను రూపొందించింది. జావలిన్, స్టింగర్ వంటి ఆధునిక వెస్ట్రన్ టెక్నీ ఇరాన్ సొంత ఆయుధాల తయారీకి వాడుకుంటూ అగ్రరాజ్యానికే సవాల్ విసురుతోంది.
News March 2, 2026
కట్టె జనుములో కాయ తొలిచే పురుగు – నివారణ

రబీలో సాగు చేసే కట్టె జనుమును కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ శిలీంద్రాల వల్ల విత్తనం రంగుమారడం, కుళ్లిపోవడం జరిగితే కాయ ఏర్పడే దశలో లీటరు నీటికి కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీ చేయాలి.


