News January 14, 2025

రైతులకు గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు సబ్సిడీ!

image

TG: కూరగాయలు సాగు చేసే రైతులు శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత పందిళ్లకు ఎకరానికి ₹3లక్షలు ఖర్చు కానుండగా, అందులో 50% సబ్సిడీ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌ను తొలుత NZB(D) బోధన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. తీగ జాతి కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ స్కీమ్ అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు సమాచారం.

Similar News

News January 1, 2026

మీ త్యాగం వల్లే ఈ సెలబ్రేషన్స్.. సెల్యూట్❤️

image

లోకమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. మనం ఇక్కడ మిత్రులతో విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తుంటే.. గడ్డకట్టే హిమపాతంలో కుటుంబానికి దూరంగా సైనికులు దేశం కోసం పహారా కాస్తున్నారు. వారు చేస్తున్న సేవ, త్యాగం వల్లే మనం సురక్షితంగా వేడుకలు జరుపుకోగలుగుతున్నాం. ఆ వీర జవాన్లందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం.

News January 1, 2026

గత పాలకుల పాపాలతోనే సమస్యలు: అనగాని

image

AP: భూ రిజిస్ట్రేషన్లలో దొర్లిన లోపాల సవరణకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఎ.సత్యప్రసాద్ తెలిపారు. ‘గత పాలకుల కబ్జాలు, ఆక్రమణల పాపాల వల్ల ఈ సమస్యలు వచ్చాయి. రియల్టర్ల అక్రమాలతో డబుల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్నీ కలెక్టర్లకే ఇచ్చాం. ఎవరు తప్పుచేసినా చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడంపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

News January 1, 2026

కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

image

రష్యా నియంత్రణలోని ఖేర్సన్‌లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.