News September 9, 2024

వరద బాధితులకు గుడ్ న్యూస్?

image

TG: వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. కానీ అది సరిపోదని, ఉదారంగా సాయం చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతులకు రూ.6,500, దుస్తులకు రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తం రూ.17,500 ఇవ్వనుంది.

Similar News

News January 6, 2026

₹19,391CR పెట్టుబడులు…11,753 ఉద్యోగాలు

image

AP: CM CBN అధ్యక్షతన జరిగిన SIPB సమావేశం 14 సంస్థలకు సంబంధించిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 11,753 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాగా పాలసీలను అందరికీ సమానంగా అమలుచేయాలని CBN సమావేశంలో స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఉద్యాన పంటల ఉత్పత్తులు భారీగా వస్తాయని, అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని చెప్పారు. స్పేస్ సిటీ కోసం 5వేల ఎకరాలు అవసరమన్నారు.

News January 6, 2026

కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది: CJI

image

కాలుష్య నివారణలో ధనవంతులూ త్యాగాలు చేయాలని CJI సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ‘కార్లు స్టేటస్ సింబల్‌గా మారాయి. సైకిళ్లు మానేసి కార్లు కొనడానికి డబ్బు ఆదా చేస్తున్నారు. ధనవంతులు ఎక్కువ కార్లు కొనడం మానేస్తే కాలుష్యం తగ్గుతుంది. హై ఎండ్ కార్లకు బదులు EVలను వాడొచ్చు’ అని సూచించారు. ఢిల్లీ కాలుష్య నివారణలో AQMC విఫలమవుతోందన్నారు. టోల్ ప్లాజాల మూసివేతకు 2నెలల సమయం కావాలని కోరడాన్ని తప్పుబట్టారు.

News January 6, 2026

హరిద్వార్ ఘాట్లలో హిందూయేతరుల ఎంట్రీపై నిషేధం?

image

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ 105 ఘాట్లలో హిందూయేతరుల ఎంట్రీపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బ్యాన్‌ను 2027 జనవరిలో జరిగే అర్ధ కుంభ్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది. సాధువులు, గంగా సభ నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిషికేశ్, హరిద్వార్‌లను సనాతన్ పవిత్ర షెహర్ (పవిత్ర నగరాలు)గా ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది.