News October 30, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. పెరిగిన డీఏను నవంబర్ జీతంతో కలిపి ఇవ్వనుంది. 2022 జులై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.

Similar News

News February 4, 2026

‘వారణాసి’ సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ!

image

‘వారణాసి’ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలిపారు. మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్, వచ్చే ఏడాది APR 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.

News February 4, 2026

ఒక్క రోజే రూ.20వేలు పెరిగిన కేజీ సిల్వర్

image

నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.20,000 పెరిగి రూ.3,20,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే రేటు కొనసాగుతోంది. అటు బంగారం ధరలు కూడా ఇవాళ <<19045966>>భారీగా పెరిగిన<<>> విషయం తెలిసిందే.

News February 4, 2026

హిస్టరీ క్రియేట్ చేయనున్న దీదీ!

image

పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అరుదైన రికార్డు సృష్టించబోతున్నారు. రాష్ట్ర ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘంతో జరుగుతున్న పోరులో భాగంగా సుప్రీంకోర్టులో తన వాదనలను ఆమె స్వయంగా వినిపించనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మమత, CM హోదాలో ఉండి సర్వోన్నత న్యాయస్థానంలో స్వయంగా వాదించబోతున్న తొలి CMగా నిలవనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షిండమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.