News February 3, 2025

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

image

TG: నేత కార్మికులకు ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ బిగించి లబ్ధిదారులకు ఇవ్వనుంది. త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక యూనిట్ కింద ₹8L విలువైన 4 లూమ్స్ ఇస్తారు. యూనిట్ విలువలో 50% సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, 10% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

Similar News

News March 19, 2026

‘ఉగాది పచ్చడి’ రుచుల ప్రత్యేకతలివే!

image

ఉగాది పచ్చడిలోని షడ్రుచులను మనిషి జీవితానికి అన్వయం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
☛ చేదు: జీవితంలో బాధలు, కష్టాలను తెలియజేస్తుంది.
☛ తీపి: ఆనందం, సంతోషం, విజయాన్ని సూచిస్తుంది.
☛ పులుపు: ఆశ్చర్యకరమైన, కొత్త అనుభవాలను తెలుపుతుంది.
☛ వగరు: కొత్త ఆశలు, అవకాశాలను చెబుతుంది.
☛ కారం: కోపం, పోరాటాలను తెలియజేస్తుంది.
☛ ఉప్పు: భయం, సమతుల్యతను సూచిస్తుంది.

News March 19, 2026

అనుష్క పెళ్లి.. టీమ్ క్లారిటీ

image

ఈ ఏడాదే అనుష్క శెట్టి పెళ్లంటూ వస్తున్న రూమర్స్‌ను ఆమె టీమ్ కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ప్రకటించింది. అధికారిక సమాచారం లేకుండా ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దని మీడియాను కోరింది. అలాగే అనుష్క ఏజ్‌కు సంబంధించిన ప్రస్తావన పదే పదే తీసుకురావడం ఆమె ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొంది. వ్యక్తిగత విషయమైన పెళ్లిపై ఇలా రూమర్స్ సృష్టించడం సరికాదని తెలిపింది.

News March 19, 2026

వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వరి పొలంలో ఉన్న మురుగు నీటిని బయటకు పంపి మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడకూడదు. 10 కేజీల స్వర్ణపాల్ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 100 కేజీల వర్మికంపోస్ట్‌లో కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటికి నీటిలో కరిగే స్థూల పోషకాలు (19.19.19) 10 గ్రాములను, 3 నుంచి 5 గ్రాముల సూక్ష్మపోషకాలను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.