News March 27, 2025

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

image

AP: చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Similar News

News March 30, 2025

హార్దిక్‌ పాండ్యకు మరో షాక్!

image

వరుస ఓటముల్లో ఉన్న MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. నిన్న GTతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఓ కెప్టెన్‌కు ఫైన్ పడటం ఇదే తొలిసారి. గత సీజన్‌ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ ఉండటంతో ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో హార్దిక్ నిషేధానికి గురయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ తరచూ జరిమానాల్ని ఎదుర్కొంటున్నారు.

News March 30, 2025

నేను, భట్టి జోడెద్దుల్లా పని చేస్తున్నాం: రేవంత్

image

TG: జీవితంలో తాను తీసుకున్న ప్రతి సంకల్పం నెరవేరిందని CM రేవంత్ అన్నారు. తాను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ‘కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమూనా అవుతుంది. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అభివృద్ధి జరిగినప్పుడు అడ్డంకులొస్తాయి. అలాగని ఆగిపోకుండా అందరి సహకారం తీసుకుంటాం. దేవుళ్లనే నూటికి నూరు శాతం ఆమోదించడం లేదు’ అని ఉగాది వేడుకల కార్యక్రమంలో అన్నారు.

News March 30, 2025

అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది: సీఎం చంద్రబాబు

image

AP: జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని CM చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని కోరారు. 20 ఏళ్ల క్రితమే IT ప్రాముఖ్యత చెప్పానని, తన మాట విని IT వైపు వెళ్లిన వారు మంచి స్థితిలో ఉన్నారన్నారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని CM వివరించారు.

error: Content is protected !!