News November 3, 2024
ఇళ్లు కట్టుకునేవారికి గుడ్న్యూస్!

AP: రాష్ట్రంలోని నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ పర్మిషన్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. 300 గజాల్లోపు ఇళ్లకు సులభంగా ప్లాన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల విధానాలు పరిశీలించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
Similar News
News October 24, 2025
ఇజ్రాయెల్ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.
News October 24, 2025
అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం
News October 24, 2025
WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.