News March 19, 2024
హోం లోన్ తీసుకునే వారికి GOOD NEWS
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710859657282-normal-WIFI.webp)
గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ప్రకటించింది. 8.45%గా ఉన్న వడ్డీ రేటులో 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక నుంచి తమ బ్యాంకులో హోంలోన్ వడ్డీ రేటు 8.3% నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని BOI పేర్కొంది.
Similar News
News July 3, 2024
సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్@80,000
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716789818106-normal-WIFI.webp)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80వేల మార్క్ తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News July 3, 2024
మహేశ్ మూవీలో విలన్గా మలయాళ హీరో?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719977771506-normal-WIFI.webp)
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
News July 3, 2024
విద్యార్థులకు గుడ్న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718229788795-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్టాప్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్టాప్లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.