News October 21, 2024

మాల్దీవ్స్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్

image

మాల్దీవ్స్‌కు వెళ్లే భారతీయులకు ప్రెసిడెంట్ ముయిజ్జు గుడ్‌న్యూస్ చెప్పారు. అక్కడ UPI పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో అక్కడ పేమెంట్స్ చేయడం భారతీయులకు సులభతరం కానుంది. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసె‌స్‌లో సహకారం అందించేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో మాల్దీవ్స్‌లో యూపీఐ పేమెంట్స్‌ తీసుకురావాలని ఆయన నిర్ణయించారు.

Similar News

News October 21, 2024

స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్స్

image

బంగారం ధరలు మరోసారి పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.79,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.73,000గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ దూసుకెళ్తోంది. నిన్నటి వరకు రూ.1,07,000 ఉండగా ఇవాళ మరో రూ.2000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ.1,09,000కి చేరింది.

News October 21, 2024

హైకోర్టులోనే తేల్చుకోండి: SC

image

TG: గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.

News October 21, 2024

మీ జీవితంలో పరిచయమయ్యే ముగ్గురు వీరే: గోయెంకా

image

జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తుల గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘మీ జీవిత ప్రయాణంలో ఎవరినీ నిందించకండి. ఎందుకంటే, మంచి వ్యక్తులు మాత్రమే మీకు ఆనందాన్ని ఇస్తారు. చెడు వ్యక్తులు మీకు అనుభవాన్ని ఇస్తారు. చెత్తవారు మీకు గుణపాఠం చెబుతారు. ఉత్తమమైన వారు మీకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోతారు’ అని పోస్ట్ చేశారు. గోయెంకా తెలిపిన వ్యక్తులు మీకూ పరిచయం అయ్యారా?