News March 21, 2025
IPL అభిమానులకు గుడ్ న్యూస్

IPL ప్రేమికులకు BCCI శుభవార్త చెప్పింది. దేశంలోని 50 నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. స్టేడియంను తలపించేలా లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్, మ్యూజిక్, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, కిడ్స్ ప్లే జోన్, ప్లే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో నిజామాబాద్ (APR 5,6 తేదీల్లో), విజయవాడ (MAY 10,11), వరంగల్ (MAY 17, 18), కాకినాడ (MAY 23, 25)లో ఏర్పాటు కానున్నాయి.
Similar News
News March 28, 2025
మీకు తెలుసా?.. రూ.45కోట్ల బడ్జెట్…రూ. లక్ష దాటని కలెక్షన్స్

బాలీవుడ్లో గతేడాది వచ్చిన లేడీ కిల్లర్ చిత్రం రూ.45కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ వంటి స్టార్లు నటించారు. ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్గా నిలిచింది. ఇందులో విషయమేముంది అనుకుంటున్నారా? ఈ మూవీ మెుదటి వారం రూ.1లక్ష కంటే తక్కువే వసూలు చేసిందట. అంతే కాకుండా, కొనుగోలు చేయడానికి OTTలు రాకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్లో మూవీని రిలీజ్ చేశారు.
News March 28, 2025
బిల్లులు చెల్లించండి.. సీఎంకు కాంట్రాక్టర్ల లేఖ

AP: సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగాదికల్లా రూ.2కోట్ల లోపు బిల్లులను చెల్లించాలని కోరింది.
News March 28, 2025
ఛార్జీలు పెంపు.. మే 1 నుంచి అమలు

ATM ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నెలవారీ ఉచిత లావాదేవీలు దాటాక ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేయనున్నారు. కస్టమర్లు సొంత బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో సిటీలు అయితే 5 సార్లు, నాన్-మెట్రో సిటీలు అయితే 3 ట్రాన్సాక్షన్లకు ఛాన్స్ ఉంటుంది. వాటిని మించితే ప్రస్తుతం రూ.21 ఛార్జ్ చేస్తున్నారు. మే 1 నుంచి రూ.23 ఛార్జ్ చేయనున్నారు.