News April 16, 2025

పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి నెలనెలా జీతాలు అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీ‌రాజ్ శాఖ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతినెలా వీరి జీతాల కోసం రూ.115కోట్లు కేటాయించనున్నారు. ఇకపై వారికి నెలనెలా వేతనాలు అందేలా ప్రత్యేక పోర్టర్ రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 92వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

Similar News

News April 16, 2025

ఐఫోన్ అమ్మకాల్లో రికార్డు

image

భారత్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 30 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. తొలి 3 నెలల్లో ఈ స్థాయిలో సేల్ జరగడం ఇదే తొలి సారి. గత ఏడాది ఇదే సమయంలో 22.1 లక్షల ఫోన్లు అమ్ముడవగా, ఈసారి 36.1% వృద్ధి నమోదైంది. దీంతో మార్కెట్ షేర్‌లో యాపిల్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియాలో టాప్-2లో ఉండే వివో (2.7%), శాంసంగ్ (19.5%) అమ్మకాల్లో ఈసారి తగ్గుదల కనిపించగా, ఒప్పో (14.3%), రియల్ మీ (5.3%) సేల్స్ పెరిగాయి.

News April 16, 2025

ఎంపీల అటెండెన్స్.. టాప్ ఎవరంటే?

image

TG: 24 జూన్ 2024 – 4 ఏప్రిల్ 2025 మధ్య పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ 100 శాతం హాజరయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరు నమోదు చేశారు. BJP MP ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91 శాతం సమావేశాలకు హాజరయ్యారు. డీకే అరుణ 73 ప్రశ్నలు అడిగి 88 శాతం హాజరయ్యారు. MIM MP అసదుద్దీన్ 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ MP రఘువీర్ అతి తక్కువగా 8 ప్రశ్నలే అడిగారు.

News April 16, 2025

ఇండియన్ రైల్వే‌స్‌కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.

error: Content is protected !!