News April 9, 2025
ఫోన్పే, గూగుల్పే వాడే వారికి శుభవార్త

UPI పేమెంట్ల పరిమితిని పెంచేందుకు NPCIకి RBI అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం P2M(వ్యక్తి నుంచి వ్యాపారికి) పంపే లావాదేవీ పరిమితి ₹2లక్షల వరకే ఉంది. తాజాగా RBI అనుమతితో ₹5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. P2P లావాదేవీలను మార్చకుండా, P2M లిమిట్ మాత్రమే పెంచే ఛాన్సుంది. బ్యాంకులతో చర్చల తర్వాత NPCI దీనిపై ప్రకటన చేయనుంది. కాగా ఎడ్యుకేషన్, బీమా, హెల్త్ కేర్ రంగాలకు చేసే UPI పేమెంట్ లిమిట్ ₹5లక్షల వరకూ ఉంది.
Similar News
News November 18, 2025
కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.
News November 18, 2025
కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.
News November 18, 2025
బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెడుతున్నారు: మద్రాస్ హైకోర్టు

విఫలమైన ప్రతి బంధాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) వ్యాఖ్యానించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దేవా విజయ్(తిరునెల్వేలి) తనతో 9ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్నాడని, మోసం చేశాడని ఓ యువతి రేప్ కేసు పెట్టింది. దీనిపై విజయ్ కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు యువతిని మోసం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.


