News August 11, 2024
రేషన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్

TG: వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని క్యాబినెట్ సబ్కమిటీ నిర్ణయించింది. చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందని, దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్లు గుర్తించింది. రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. కుటుంబ సమగ్ర ఆరోగ్య వివరాలతో వీటిని జారీ చేయనుంది.
Similar News
News November 22, 2025
చిత్తూరు: ఉచితంగా స్కూటీలు.. మరో 3 రోజులే.!

జిల్లాలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీ కోసం ఆన్లైన్ దరఖాస్తులకు మరో 3రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థులు 25వ తేదీలోపు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అవసరమైన పత్రాలను APDASCELC.AP.GOV వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ఉమ్మడి చిత్తూరు నుంచి 124 అప్లికేషన్స్ నమోదైనట్లు తెలిపారు. నియోజకవర్గానికి 10 వాహనాలు ఇవ్వనున్నట్లు, లబ్ధిదారులు రూ.1 కూడా చెల్లాంచాల్సిన అవసరం లేదన్నారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.


