News August 11, 2024
రేషన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్

TG: వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని క్యాబినెట్ సబ్కమిటీ నిర్ణయించింది. చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందని, దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్లు గుర్తించింది. రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. కుటుంబ సమగ్ర ఆరోగ్య వివరాలతో వీటిని జారీ చేయనుంది.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


