News August 22, 2024
రేషన్కార్డులు ఉన్న వారికి శుభవార్త

TG: రేషన్కార్డు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాం. రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి. బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,629 రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News April 2, 2026
కరెంట్ అఫైర్స్

* డీజీసీఏ చీఫ్గా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం
* AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం
* ‘పారాక్వాట్’ గడ్డిమందుపై తెలంగాణ తాత్కాలిక నిషేధం
* భారత్ తొలి డిజిటల్ సెన్సస్ ప్రారంభం
* గుజరాత్లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి సంశోధక్ సర్వే నౌక
* భారత్ వేదికగా మే నెలలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు
News April 2, 2026
సేల్స్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 5శాతమే.. అదే కారణమా?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా కార్లలో వీటి వాటా ఐదు శాతంలోపే ఉంది. FY26లో మొత్తం 2,29,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో (1,23,400 యూనిట్లు) పోలిస్తే వృద్ధి నమోదైనా ఆశించినంత వేగంగా సేల్స్ పెరగట్లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత, కార్ రేంజ్ – రీసేల్ వ్యాల్యూపై అనుమానాలు ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి.
News April 2, 2026
ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

* 1942: గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ జననం
* 1969: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జననం
* 1872: టెలిగ్రాఫ్ ఆవిష్కర్త సామ్యుల్ మోర్స్ మరణం
* 1933: క్రికెటర్ మహారాజా రంజిత్ సింహ్జీ మరణం (ఫొటోలో)
* 2011: వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ విజయం
* అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
* వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే


