News August 3, 2024
స్కూల్ విద్యార్థులకు శుభవార్త

TG: పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి, ఆగస్ట్ 15, జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, నిత్యం గంట స్పోర్ట్స్ పీరియడ్ పెట్టాలని MLCలు ఆయన దృష్టికి తేవడంతో ఈ ప్రకటన చేశారు.
Similar News
News November 23, 2025
VKB: జిల్లాలో 594 జీపీలకు రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలో 594 గ్రామపంచాయతీలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, నాయకుల సమక్షంలో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేశారు. తాండూర్ డివిజన్ 8 మండలాల్లో 262 గ్రామపంచాయతీలకు వికారాబాద్ డివిజన్లో 12 మండలాలకు 332 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.
News November 23, 2025
సంగారెడ్డి: జిల్లాలో మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు

గ్రామపంచాయతీ ఎన్నికల అధికార యంత్రం చకచక ఏర్పాటు చేస్తుంది. సంగారెడ్డి జిల్లాలో 24 మండలాలకు సంబంధించిన మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలను 8 చొప్పున మండలాలను మూడు విడతల వారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు ఓటర్ జాబితాలను ప్రదర్శించారు. అయితే తాజా పంచాయతీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మరోసారి నమోదు చేసుకుని అవకాశం కల్పించారు.
News November 23, 2025
VKB: జిల్లాలో 594 జీపీలకు రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలో 594 గ్రామపంచాయతీలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, నాయకుల సమక్షంలో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేశారు. తాండూర్ డివిజన్ 8 మండలాల్లో 262 గ్రామపంచాయతీలకు వికారాబాద్ డివిజన్లో 12 మండలాలకు 332 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.


