News April 11, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 10.36 లక్షల స్కూళ్లలోని 11.20 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రైమరీ విద్యార్థులకు 0.59 పైసలు, ప్రాథమికోన్నత విద్యార్థులకు 0.88 పైసలు పెంచింది. దీంతో ఒక్కో విద్యార్థికి 20 gms పప్పులు, 50gms కూరగాయలు, 5gms నూనెతో ఆహారం అందించొచ్చు.

Similar News

News October 13, 2025

కెంటన్ మిల్లర్ అవార్డు సాధించిన మొదటి భారత మహిళ

image

కజిరంగా నేషనల్‌ పార్క్‌ మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సొనాలి ఘోష్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన IUCN కెంటన్ మిల్లర్ అవార్డును పొందారు. వణ్యప్రాణుల సంరక్షణకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది. పూణేలో జన్మించిన సొనాలి వైల్డ్‌లైఫ్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ లా చదివారు. పులులను ట్రాక్‌ చేసే రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీపై పరిశోధించి డాక్టరేట్‌ పొందారు.

News October 13, 2025

అంబేడ్కర్ ఓపెన్‌ వర్సిటీలో ప్రవేశాలు.. 2 రోజులే ఛాన్స్!

image

TG: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి BA, B.Com, BSc కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు ఈనెల 15తో ముగియనుంది. ఇదే చివరి అవకాశం అని విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ 10+2 ఉత్తీర్ణులు అర్హులని చెప్పారు. విద్యార్థులు దరఖాస్తుల కోసం <>www.braouonline.in<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News October 13, 2025

విద్యార్థినులకు తోడ్పాటునందించే స్కాలర్‌షిప్

image

దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే విద్యార్థినులకు యూ-గో సంస్థ స్కాలర్‌షిప్ అందజేస్తోంది. 10th, Interలో 70% మార్కులు సాధించి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు అర్హులు. సంవత్సరానికి 40వేలు అందిస్తారు. చివరి తేదీ అక్టోబరు 31. వెబ్‌సైట్: <>www.b4s.in/sen/RFS12<<>>