News April 11, 2025
స్కూలు విద్యార్థులకు శుభవార్త

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 10.36 లక్షల స్కూళ్లలోని 11.20 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రైమరీ విద్యార్థులకు 0.59 పైసలు, ప్రాథమికోన్నత విద్యార్థులకు 0.88 పైసలు పెంచింది. దీంతో ఒక్కో విద్యార్థికి 20 gms పప్పులు, 50gms కూరగాయలు, 5gms నూనెతో ఆహారం అందించొచ్చు.
Similar News
News November 25, 2025
స్మృతి మంధానను లవర్ పలాశ్ మోసం చేశాడా?

క్రికెటర్ స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ <<18374733>>వివాహం<<>> ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో వివాహాన్ని ఆపేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు మ్యారేజ్ క్యాన్సిలవ్వడానికి కారణం మరొకటుందని SMలో చర్చ జరుగుతోంది. పలాశ్ వేరే యువతితో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. అందుకే స్మృతి పెళ్లి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ స్క్రీన్ షాట్స్ను అఫీషియల్గా ధ్రువీకరించాల్సి ఉంది.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77 సమాధానాలు

ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని ఎందుకు అడిగాడు?
జవాబు: ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోటిని బాణాలతో కుట్టి, దాన్ని మొరగకుండా చేశాడు. ఈ విలువిద్యను చూసిన ద్రోణుడు అతనికి అస్త్రాలను దుర్వినియోగం చేస్తాడని, విచక్షణా రహితంగా వాడే అవకాశముందని విలువిద్యకు కీలకమైన బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. అలాగే అర్జునుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
బ్రెస్ట్ నుంచి స్రావాలు వస్తున్నాయా?

రొమ్ములనుంచి ఎలాంటి స్రావాలు వచ్చినా క్యాన్సర్ అని చాలామంది భావిస్తారు. అయితే ఇదీ ఒక క్యాన్సర్ లక్షణమే కానీ, అన్నిసార్లూ అదే కారణం కాదంటున్నారు నిపుణులు. గెలాక్టోరియా వల్ల కూడా ఇలా జరగొచ్చంటున్నారు. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం, హైపోథైరాయిడిజమ్, కణితులు, లోదుస్తులు బిగుతుగా ఉండటం వల్ల కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.


