News August 30, 2024
సింగరేణి కార్మికులకు GOOD NEWS

TG: సింగరేణిలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ కార్మికులను రెగ్యులర్ వర్కర్లు(జనరల్ మజ్దూర్)గా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ MD బలరామ్ తెలిపారు. భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనుల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని SEP 1 నుంచి రెగ్యులరైజ్ చేస్తామన్నారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య, డిపెండెంట్ కింద సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా పరిగణిస్తారు.
Similar News
News September 18, 2025
అనకాపల్లి జిల్లాకు 18వేల టన్నుల యూరియా సరఫరా

అనకాపల్లి జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాలకు ఇంతవరకు 18వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రావు బుధవారం తెలిపారు. మత్సవానిపాలెం రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన సమీక్షించారు. జిల్లాలో ఆహార, వాణిజ్య, ఉద్యానవన పంటలు 1,41,000 హెక్టార్లలో సాగులో ఉన్నాయని చెప్పారు. వీటికి అక్టోబర్ నెల మొదటి వారం వరకు 20 వేల టన్నుల యూరియా అవసరమన్నారు.
News September 18, 2025
మళ్లీ భారత్vsపాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

ఆసియా కప్-2025లో భారత్vsపాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో ఈ ఆదివారం (Sep 21) రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. కాగా గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్-4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడనుంది. అటు గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సూపర్-4 రేసులో ఉన్నాయి.
News September 18, 2025
భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం.. ట్రంప్ తీవ్ర ఆరోపణ

భారత్, చైనా, పాక్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ దేశాలు డ్రగ్స్, వాటి తయారీకి కావాల్సిన రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ US ప్రజల భద్రతకు ప్రమాదంగా మారాయని విమర్శించారు. అఫ్గాన్, మెక్సికో, హైతీ, కొలంబియా, పెరూ, పనామా, బొలీవియా, బర్మా వంటి దేశాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. US కాంగ్రెస్కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్లో ఈ ఆరోపణలు చేశారు.