News July 4, 2025
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇకపై ఆన్లైన్ టోకెన్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం-శుక్రవారం వరకు మ.1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. వచ్చేవారం నుంచి టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, ఇందుకోసం https://www.srisailadevasthanam.org/en-in సైట్లో ఒక రోజు ముందుగా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 5, 2025
మతపరమైన అంశాల్లో కలగజేసుకోం: భారత్

భారత ప్రభుత్వం మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ‘మత విశ్వాసాలపై ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోదు. భారత్లో మతపరమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయంలో కలగజేసుకోవద్దని భారత్ను చైనా <<16940241>>హెచ్చరించిన <<>>విషయం తెలిసిందే.
News July 5, 2025
ఉత్కంఠ మ్యాచ్.. భారత్ ఓటమి

ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. ఓపెనర్లు సోఫియా 75, వ్యాట్ 66 రన్స్తో రాణించారు. ఛేదనలో భారత ఓపెనర్లు మంధాన 56, షఫాలీ 47 రన్స్ చేసి అద్భుత ఆరంభాన్నిచ్చినా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5 రన్స్ తేడాతో ఓడిపోయింది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి 2 గేమ్స్ గెలిచిన టీమ్ ఇండియా 2-1తో లీడ్లో ఉంది.
News July 5, 2025
ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.